ఎన్టీఆర్ కోసం బెస్ట్ టెక్నీషియన్స్ ను తీసుకొస్తున్న కళ్యాణ్ రామ్ !



వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తరువాతి చిత్రాన్ని దర్శకుడు బాబీ డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో మంది కథలు విని రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్ బాబీ చెప్పిన కథకు ఓకే చెప్పడంతో ఈ ప్రాజెక్టులో అంత విశేషమేముందనే ఆసక్తి అందరిలోనూ రేకెత్తింది. ఈ క్రేజీ ప్రాజేతును ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు.

ఎన్టీఆర్ కు ఇది 27 వ చిత్రం. ఈ చిత్రాన్ని అన్ని విధాలుగా గొప్పగా రూపొందించాలని నిర్ణయించుకున్నాడు కళ్యాణ్ రామ్. అందుకే సాంకేతిక విభాగంలో బెస్ట్ టెక్నీషియన్స్ ఉండేలా చూస్తున్నాడు. అందులో భాగంగానే జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న సినిమాటోగ్రాఫర్ సీకే మురళీధరన్ ను ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నాడు. మురళీధరన్ గతంలో పీకే, త్రీ ఇడియట్స్, మొహంజొదారో వంటి భారీ స్థాయి బాలీవుడ్ చిత్రాలకు పనిచేశారు. పీకే చిత్రానికి గాను ఆయన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డును కూడా అందుకున్నారు. ఇకపోతే ఈ చిత్రం ఎప్పుడు లాంఛ్ అవుతుంది, ఇతర నటీ నటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

కామెంట్‌లు