రజనీకాంత్ హీరోగా, బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్కుమార్ విలన్గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీక్వెల్ చిత్రం ‘2.0’. ఈ సినిమా ఫస్ట్లుక్ విడుదల కార్యక్రమం ముంబయిలో మొన్న ఆదివారం హంగామాగా జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ ఫస్ట్ లుక్ ఫంక్షన్ తో ఒక్కసారిగా సినిమాపై ఓ రేంజిలో హైప్ క్రియేట్ అయ్యింది. జనాల్లో ఈ సినిమాకు హైప్ క్రియేట్ అయ్యింది ఓకే..ఇప్పుడు ఈ సినిమాకు అన్ని భాషల్లోనూ క్రేజ్ తెచ్చి మార్కెట్ చేయాలనేది నిర్మాతల నెక్ట్స్ వ్యూహం గా కనపడుతోంది. ఆల్రెడీ ఈ సినిమాలో రజనీకాంత్ హీరో కాబట్టి తెలుగు,తమిళంకు పెద్ద బాధ లేదు. ముఖ్యంగా తమిళం వాళ్లు ఎగబడి చూస్తారు. అయితే తెలుగునుంచి కూడా ఓ స్టార్ హీరో ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన దర్శక,నిర్మాతలకు ఉందిట
హిందీకోసం ..అక్షయ్ కుమార్ ఉన్నాడు కాబట్టి బాలీవుడ్లో మంచి ప్రమోషన్ లభిస్తుంది. మరి, తెలుదు మాటేమిటి. అందుకే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఓ స్టార్ హీరోతో ఇందులో ఓ స్పెషల్ రోల్ చేయించాలని డిసైడ్ అయ్యి, చర్చలు జరుపుతున్నట్లు మీడియాలో వార్తలు వినపడుతున్నాయి. నిజమైతే సూపర్ ఇక ఈ చిత్రంలో గెస్ట్ రోల్ గా చేయటానికి ఎన్టీఆర్ ని అడిగారని తెలుస్తోంది. ఎన్టీఆర్ సైతం…తమిళనాట ఈ సినిమాతో క్రేజ్ వస్తుందని భావిస్తున్నారట. మొదట ప్రభాస్ ని అడిగినా ..బాహుబిలి బిజిలో ఉన్నారని చెప్పార. ఎన్టీఆర్ ని అడిగింది నిజమే అయితే సూపర్ అంటున్నారు అభిమానులు. ఈ చిత్రంలో గెస్ట్ గా చేసే హీరో కనపడేది చాలా తక్కువ సేపే అంటున్నారు. అయితే రెమ్యునేషన్ మాత్రం గట్టిగా ఇస్తారని చెప్పుకుంటున్నారు. అయితే గెస్ట్ గా చేసే హీరో ఎవరన్నది ఆడియో రిలీజ్ రోజు రివీల్ చేయాలని ఫిక్స్ అయ్యారట.

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి